గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం

Published: Monday October 17, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 16 అక్టోబర్ ప్రజా పాలన : జిల్లాలో  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
ఆదివారం జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు.  సిద్దార్థ జూనియర్ కళాశాల, భృంగి ఇంటర్నేషనల్ స్కూల్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.  హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాలలో మొత్తం 4857 అభ్యర్థులకు గాను 4024 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 833 మంది గైర్హాజరయ్యారని 82.8 శాతం హాజరు నమోదు అయినట్లు కలెక్టర్ ఈ సందర్బంగా తెలియజేసినారు.