ఆక్సిజన్ కాన్స ట్రైటర్లు అందజేత

Published: Thursday June 10, 2021

వలిగొండ, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మండల మండల పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన జి.మల్లయ్య తండ్రి నర్సయ్య కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని వారి కుటుంబ సభ్యులు మండల బీజేపీ నాయకులను సంప్రదించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆపదలో ఉన్న వారిని అదుకునెందుకు కృషి చేస్తున్న మన ప్రియతమ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి సేవ కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండలానికి ఆక్సిజన్ కన్సట్రేటర్లను అందించడం జరిగింది. దానిని సంబందిత కుటుంబ సభ్యులకు బుధవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి, వార్డు మెంబర్ డొగిపర్తి సంతోష్, మైసోళ్ల మత్స్యగిరి, బుంగమట్ల మహేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.