జోడోయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు * టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎనుగంటి మధుసూదన్ రెడ్డి

Published: Friday March 03, 2023
వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన :  ప్రధాని నరేంద్ర మోడీ కుబేరులైన ఆదాని అంబానీ లకు వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని రాష్ట్రంలో బిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దొందు దొందే అని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎనుగంటి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. గురువారం షాబాద్ మండల పరిధిలోని అంతారం బోరంపాడు గ్రామాలలో హాత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేవలం 500 కే వంట గ్యాస్ చేయి మహిళలను ఆదుకుంటామని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఎన్నికల ముందు నల్లధనాన్ని వెలికి తీస్తానని ప్రతి ఖాతాదారుని అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని సంవత్సరానికి నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను మర్చిపోయారని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ముఖ్యమంత్రి పదవి,మూడు ఎకరాల భూమి,నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటిని తుంగలో తొక్కాడని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముకై నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు ఒక్క పూట తిండి తినలేని పరిస్థితి దాపురించిందని దుయ్యపట్టారు.దళిత బంధు పథకంతో దళితులకు జీవన రేఖలు మారుస్తామన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దళితునికి ఉపయోగకరం లేకుండా చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే యాదయ్య పదవీకాలం పూర్తవుతున్న ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయకపోవడం విచారకరమని అన్నారు.షాబాద్ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్  మాట్లాడుతూ,అంతారం, బోరంపాడు ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని ఏ ఆపద వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే ఆదుకుంటానని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్,బిజెపి లను మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని,రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని,చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు మాణయ్య,
నవాబ్ పేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కైసర్,లక్ష్మణ్,సుధాకర్,సురేష్, ఆనంద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.