విద్యతోనే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు

Published: Wednesday July 27, 2022

రాయికల్, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక,బాలికల,బాలుర,ఉర్దూ పాఠశాలలోని 460మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కాటిపెళ్లి రాంరెడ్డి కూతురు శ్వేత జన్మదినం, నరంశెట్టి మనోజ్, సింగని వంశీ దాతల సహకారంతో విద్యార్థులకు 460నోట్ బుక్,  పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ అధ్యక్షుడు ఎద్దండి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధన  సామాగ్రి అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ రమేష్, భూమయ్య, క్లబ్ కోశాధికారినరేష్, ఉపాధ్యక్షులుమచ్చశేఖర్, శ్రీనివాస్,నర్సయ్య,శ్రీకాంత్,కట్కం కళ్యాణ్, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు,బందెల శ్రీనివాస్, ప్రభుత్వ పాఠశాలప్రధానోపాధ్యాయులు తాటిపాముల సందీప్, రాజేంద్రప్రసాద్,ఉపాధ్యాయులు లక్కడి రాజారెడ్డి,రవీందర్,శ్రీలత విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు