తెలంగాణ బిసి జాగృతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష

Published: Saturday October 29, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 28, ప్రజపపాలన :  తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఐబి చౌరస్తాలో   శాంతియుత నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి బెల్లంపల్లి చౌరస్తా లో స్థలం కేటాయించాలని,  
సర్దార్ సర్వాయి పాపన్న  చత్రపతి శివాజీ  బి పి మండల్ యాదవ్, చాకలి ఐలమ్మ,  కొండా లక్ష్మణ్ బాపూజీ,  ప్రొఫెసర్ జయశంకర్ ల విగ్రహాలకు  మంచిర్యాల్ పట్టణంలో  మహనీయుల విగ్రహాల కు ముఖ్య కూడలులో స్థలం కేటాయించాలని తెలంగాణ  బి సి జాగృతి డిమాండ్ చేస్తుందని అన్నారు.   మహనీయులను   విగ్రహాల కోసం స్థలం కేటాయించాలని ఎన్నో సార్లు కలెక్టర్ కు వినతిపత్రం అందించినప్పటికీ ఇంతవరకు స్పందించక పోవడంతో ఈ నిరసన దీక్షను చేపట్టాము, ఇప్పటికైనా స్పందించి స్థలాలను కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో   తెలంగాణ బి సి జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరెడ్ల  శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మడుపు రాంప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్,   తదితరులు పాల్గొన్నారు