విజేతలకు బహుమతులు అందజేత

Published: Tuesday March 23, 2021
బాలాపూర్ : ప్రజాపాలన (ప్రతినిధి) ; మంత్రి తనయుడు కౌశిక్ రెడ్డి ఏ వై ఆర్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఏనుగు రామ్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం కి!శే! ఏనుగు రామచంద్రారెడ్డి స్మారక దినమున క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ, ద్వితీయ వారికి మెమోరియల్ ట్రోపే ని అతిధులు అందజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో తన తండ్రి జ్ఞాపకార్థనీ క్రికెట్ టోర్నమెంట్ మెమోరియల్ ట్రోపి సోమవారం నాడు ఏ వై ఆర్ గ్రౌండ్ లో విద్యా శాఖ మంత్రి తనయుడు యువ నాయకుడు కౌశిక్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ సంరెడ్డి వెంకట్ రెడ్డి, ఎక్స్ సర్పంచి ముత్యాల కృష్ణ, మీర్ పేట్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కాల కామేశ్వర్ రెడ్డి, క్రికెట్ యువకులు తదితరులు పాల్గొన్నారు.