నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ

Published: Tuesday August 10, 2021
జిన్నారం, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నీ నిరుపేద మహిళలకు స్థానిక నాయకులు, కె జె ఆర్ ట్రస్ట్ ఫౌండర్ ఆనంద్ కృష్ణారెడ్డి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మాతృమూర్తి కొత్వాల్ లక్ష్మమ్మ మొదటి వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు తన కుమారుడు జయరాం రెడ్డి చేతులమీదుగా చీరలను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.