ఆదర్శ గ్రామ సర్పంచ్ కు సన్మానం

Published: Monday November 29, 2021

కొడిమ్యాల, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో మండల సర్పంచులఫోరం అధ్యక్షులు పునుగోటి  కృష్ణ రావు ను ఘనంగా సన్మానించడం జరిగింది. మైసూర్ లో జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేట గ్రామ సర్పంచ్ కృష్ణా రావు ఎంపిక కావడంపట్ల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు కాయిత ఆనందం, ఉపాధ్యక్షులు బండి నర్సయ్య, నాయిని అంజయ్య నాయిని అర్జున్, కాయిత రాజు శేఖర్ హరీష్, రాకేష్, ప్రదీప్ ప్రశాంత్, యుగేందర్, నరేష్ ప్రమోద్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.