రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం

Published: Thursday December 01, 2022
రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు నూలి శుభప్రద పటేల్
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం అని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పిలుపునిచ్చారు.  
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో ది లైట్ ఫౌండేషన్, ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును డాక్టర్ టి.ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టి.ఆనంద్ డాక్టర్ రక్తదాన శిబిరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేకప్రాణాలు పోతున్నాయని తెలిపారు. యువత రక్తదాన శిబిరాలకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలనీ సూచించారు.