బోనాలు సమర్పించుకున్న భక్తులు
Published: Monday August 23, 2021
బోనకల్లు, ఆగస్టు 22, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రావినూతల గ్రామ పంచాయతీలో ఊరు ముత్యాలమ్మ కు గ్రామంలోని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామంలోని మహిళలందరూ తలపై బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో ఊరి చివర ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు చేరుకొని తమ బోనాలను ముత్యాలమ్మ తల్లికి సమర్పించుకొని, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఆ తల్లి చల్లని చూపుతో పంటలు బాగా పండి గ్రామంలో సిరిసంపదలు సరితుగాలని ప్రార్థనలు చేశారు. అనంతరం కోళ్లు, మేకలను తల్లి విగ్రహానికి బలి ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఉప సర్పంచ్ బోయినపల్లి కొండ.చేబ్రోలు మల్లికార్జున్, బాబు రావు, డాక్టర్ జె డి మూర్తి, సైదా, ఎం సైదా డి మోహన్ రావు, బంధం తిరుపతిరావు రామారావు నరసింహారావు గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: