సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ సంబరాలు

Published: Friday September 30, 2022
 వికారాబాద్ ఎమ్ఆర్ఓ షర్మిల
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజా పాలన : నేటితరం మన సంస్కృతి సంప్రదాయాలను మరిచి ఆధునిక పోకడలను అనుసరిస్తున్నారని వికారాబాద్ ఎమ్మార్వో షర్మిల అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గల వికాస్ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్ఆర్ఓ షర్మిల మాట్లాడుతూ పూల రంగులు వేరైనా దండలో ఐక్యతను చాటుతున్నాయని కొనియాడారు. భిన్న రంగుల పూల అమరిక చూపరులను కట్టిపడేస్తున్నాయని స్పష్టం చేశారు. మహిళల ఐకమత్యాన్ని చాటే గొప్ప ఉత్సవం బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.