చైర్మన్ ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షణ్ పై విధ్యార్ధులతో అవగాహన ర్యాలీ
Published: Tuesday December 14, 2021
మధిర డిసెంబ12 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలోస్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత మరియు కమిషనర్ అంబటి రమాదేవి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీనగర్ కాలనీ నందు శ్రీనిధి డిగ్రీ కళాశాల విధ్యార్థులతో తడి-పొడి చెత్త విభజనపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త, హోమ్ కంపోస్టింగ్, హానికరమైన చెత్త వేరుచేయుటలో పౌరుల భాద్యత పై అవగాహన ర్యాలీ నిర్వహించి వారి తో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్షినేషన్ రెండు డోస్ లు తప్పకుండ వేసుకోవాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్, కమీషనర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భాస్కర్ విధ్యార్థులు మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Share this on your social network: