సారంగాపూర్ మండల బీజేపీ కార్యవర్గ సమావేశం

Published: Thursday July 22, 2021
సారంగాపూర్, జులై 21 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల బీజేపీ కార్యవర్గ సమావేశం పెంబట్ల గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మొరపెళ్లి సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అయ్యేల ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని 2023 గెలుపే లక్షంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మండల ఇంచార్జి రగిల్ల సత్యనారాయణ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రేంటం జగదీష్ మండల ప్రధాన కార్యదర్శిలు శాంతయ్య గంగారెడ్డి వెంకటేష్ తోట సంతోష్ దీటి రాజు దళిత మోర్చా అధ్యక్షుడు మల్లేష్ మండల ఉపాధ్యక్షురాలు దోసారపు సువర్ణ ముద్దం శ్రీనివాస్ మండల కార్యదర్శులు కంపెళ్లి శేఖర్ ఆకుల పొచన్న భూక్య జీవన్ బూత్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.