దెందుకూరు సొసైటీలోబీమా చెక్కులు పంపిణీ
Published: Saturday November 26, 2022
మధిర రూరల్ నవంబర్ 25 (ప్రజా పాలన ప్రతినిధి) మండల పరిధిలోని దెందుకూరు సహకార సంఘంలో సభ్యులు ఉండి మృతి చెందిన వారికి మంజూరైన బీమా చెక్కులను శుక్రవారం దెందుకూరు సహకార సంఘం అధ్యక్షులు కోట వెంకటకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కోట వెంకటకృష్ణ మాట్లాడుతూ దెందుకూరు సహకార సంఘం లో సభ్యులుగా ఉన్న బాధ శ్రీనివాసరెడ్డి, సంపసాల వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి బాలకృష్ణ, గుర్రం కృష్ణ ప్రసాద్, నండ్రు కిరణ్ ఇటీవల మృతి చెందారని ఆయన తెలిపారు. సహకార సంఘం ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు బీమా సొమ్ము మంజూరు అయినట్లు అని తెలిపారు మంజూరైన బీమా సొమ్మును మృతుల కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు ఇత్తిరెడ్డి గురవారెడ్డి సామినేని రామనాథం సంఘం సీఈవో వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: