గణనాధుడు కు ఘనంగా పూజలు పలుచోట్ల అన్నదానాలు

Published: Monday September 05, 2022
పాలేరు సెప్టెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని సుర్దేపల్లి గ్రామంలో స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం లో నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ను నిర్వహించారు. గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, నేలకొండపల్లి. ఎంపీపీ వజ్జా రమ్య, ఎస్సై స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు కడియాల శ్రీనివాసరావు, వజ్జా శ్రీనివాస రావు, బట్ట పోతుల కిరణ్, సర్పంచ్ తోళ్ల వెంకటేశ్వర్లు, చట్టు రమణ, స్థానీక యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలం లో పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమం ను నిర్వహించారు. అజయ్ండా లో అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.