క్రీడా అభివృద్ధికి కృషి చేయాలి

Published: Monday April 04, 2022
జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి
జిల్లా స్పోర్ట్స్ క్లబ్ లోగో, జెర్సీ, ఆవిష్కరణ
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పి చైర్ పర్సన్ కోవా లక్ష్మి జిల్లా స్పోర్ట్స్ క్లబ్ సభ్యులకు సూచించారు. ఆదివారం తన నివాసంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేబీ ఆసిఫాబాద్ జిల్లా స్పోర్ట్స్ క్లబ్ లోగో, జేర్సీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడంతో జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చిన వారవుతారన్నారు. ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. ఇటీవల జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ పోటీలో పాల్గొన్న మడావి కరీనాను స్ఫూర్తిగా తీసుకోవాలని, క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ కు తుజాల్ పురం భూదేవి, రామా గౌడ్, పౌండేషన్ సభ్యులు ప్రవీణ్ గౌడ్, రామానంద్ గౌడ్, ఫుట్బాల్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తుజల్ పురం ప్రవీణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చిప్ప సురేష్, కోశాధికారి సురేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మడావి శ్రీనివాస్, కార్యదర్శి రాకేష్, సభ్యులు అరవింద్, శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.