చిరు వ్యాపారస్తులు ఆధ్వర్యంలోలడక బజారు రైల్వే గేట్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు
Published: Friday April 29, 2022
మధిర ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు పట్టణంలోని లడక బజారు రైల్వే గేట్ సెంటర్ లో ఆ ప్రాంత చిరు వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా తొలిరోజు మజ్జిగ ప్రజలకు అందజేశారు. ప్రతి నిత్యం మధిరకు ఇతర గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు వస్తుంటారని, వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో R.శశి కుమార్, సాలిక సురేష్, చెండ్యాల కోటేశ్వరరావు, చింతల శివ, బిళ్ళకంటి వేంకటేష్, రావులపాటి రవికుమార్, మునుగోటి కొండా, svr అనిల్, sk. మొహమ్మద్, sk. ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: