రహదారి ఏర్పాట్లను పరిశీలించిన పలు పార్టీల నాయకులు

Published: Thursday August 26, 2021
బోనకల్లు, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలోని 118 రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయo గా ఏర్పాటుచేసిన రహదారిని బుధవారం రోజున బోనకల్ మండలం లోని పలు రాజకీయ పార్టీల నాయకులు పరిశీలించడం జరిగింది రహదారిని పరిశీలించిన వారిలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు బోనకల్ మండలం సిపిఎం కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు బోనకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిరోజు రైతు సోదరులు ఈ రహదారి గుండా వెళ్ళ వలసి వస్తుందని కావున రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.