ఈనెల 16,17 తేదీలలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్

Published: Saturday October 15, 2022
 బోనకల్, అక్టోబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని అక్టోబర్ 16,17 తారీకులలో తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు.
  స్థానిక బోనకల్ వీర తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో శుక్రవారం మండల అధ్యక్షుడు బానోత్ గోపి అధ్యక్షతన జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.డివైఎఫ్ఐ సెంట్రల్ కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 16 17 తారీకుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండల కేంద్రాల్లో తహసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపాలని, అధిక ధరలను అరికట్టాలని, అర్హులైన ఉద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని తదితర డిమాండ్స్ తో ఈ ధర్నాలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
 జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లో ఈ ధర్నాలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు యువతకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్ ఎ జిల్లా ఉపాధ్యక్షులు సత్తనపల్లి నరేష్, జిల్లా నాయకులు రావులపాటి నాగరాజు, మండల నాయకులు బంక శ్రీను, బాబురావు, నరేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.