సీతా హోమ్స్ కాలనీ లో గణనాథుని లడ్డూకైవసం చేసుకున్న జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి
Published: Tuesday September 21, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పరిధిలోని సీతా హోమ్స్ కాలనీలో గణేషు నవరాత్రి ఉత్సవాలు అనంతరం నిర్వహించిన లడ్డు వేలం పాటలో స్థానిక కార్పొరేటర్ జిల్లెలా అరుణా ప్రభాకర్ రెడ్డి 33,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ.... స్థానిక కార్పొరేటర్ చేస్తున్న అభివృద్ధితో పాటు కాలనీ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం చేస్తూ, కాలనీలో ఒక్కడిగా కలిసిపోయి సాదా సీదాగా ఉంటూ అందరిని పలకరించి సమస్యలు తెలుసుకొని, ఆ సమస్యను వెంటనే పరిష్కారం చూపే నాయకుడిని కాలనీ వాళ్ళు అభినందిచారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. మీ సమస్య... నా సమస్యగా.. ఎల్లవేళలా మీ గురించి మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ అసోసియేషన్ వాళ్లు శాలువాలతో సన్మానించి గణనాథుని లడ్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళా మణులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: