కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
Published: Monday January 10, 2022
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అన్మగళ్ళ భిక్షపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారికి టీఆర్ఎస్ పార్టీ నుండి 2లక్షల రూపాయల భీమాను భిక్షపతి సతీమణి సంధ్య కి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షా కార్యదర్శులు అల్వాల్ వెంకట్ రెడ్డి, మడుపు వేణుగోపాల్ రావు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, యాచారం జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, చిత్తపూర్ ఎంపీటీసి సుకన్య, తెరాస నాయకులు తాళ్ల మహేష్ గౌడ్, మొద్దు అంజిరెడ్డి, బర్ల జగదీష్, జెర్కొని రాజు, కప్పరి చందు, శివ, విజయ్, చింతం రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: