బీజేపీ నేత కొల్లు బాల్ రాజ్ ఆధ్వర్యంలో విజయసంకల్ప సభకు తరలిన నాయకులు

Published: Monday July 04, 2022
మేడిపల్లి, జులై3 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే 
ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పిలుపు మేరకు మేడ్చల్ ఓబిసి మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కొల్లు బాల్ రాజ్  ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులు నవీన్ గౌడ్, లాకాన్, అంబటి దినేష్, విజయ్ గౌడ్, కురూవ రాఘవేంద్ర కుమార్, సంతోష్, శ్రీకాంత్  ప్రదీప్,  వాసు నాయక్ , అయోధ్య  వెంకట్ రావు , ప్రతాప్ రెడ్డిల  సహకారంతో వందలాది మంది యువకుల సమక్షంలో విజయ సంకల్ప సభకు ఉప్పల్ నుంచి బయల్దేరి బహిరంగసభలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా  కొల్లు   బాల్ రాజ్  మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.