పల్లా నామినేషన్ కి బ్రహ్మయ్య సారథ్యంలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ శ్రేణులు

Published: Wednesday February 24, 2021
పాలేరు ఫిబ్రవరి 23 ప్రజాపాలన: ఖమ్మం - నల్గొండ - వరంగల్ - ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పాలేరు నియోజకవర్గంనుంచి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. నేలకొండపల్లి మండలం నుంచి తెరాస మండల పార్టీ అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు పల్లా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా వున్నం బ్రహ్మయ్య, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్ లు మొదటి ప్రాధాన్యత ఓటు ను తెరాస అభ్యర్థి కి వేయాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం. లో అన్ని రంగాల్లో అభివృద్ధి లో దూసుకుపోతున్నమని మరింత అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెరాస అభ్యర్థులను గెలిపించుకుంటే నే సాధ్యమవుతుందని బ్రహ్మయ్య తెలిపారు. కార్యక్రమంలో నేలకొండపల్లి. ఎంపీపీ వజ్జా రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, నేలకొండపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శాఖమూరి సతీష్, నేలకొండపల్లి. పిఎసిఎస్. అధ్యక్షులు కోటి సైదా రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు గండు సతీష్, వజ్జా శ్రీనివాస రావు, నెల్లూరి లీలా ప్రసాద్, మాజీ ఎంపీపీ నందిగామ కవితా రాణి, వెన్న బోయిన శ్రీను, నంబూరి సత్యనారాయణ, సర్పంచులు శ్రావణ్ కుమార్, భూక్య సుధాకర్, తదితరులు పాల్గొన్నారు