సూరంశెట్టి ఉషారాణి సేవలు మరువలేనివి

Published: Monday August 08, 2022

మధిర రూరల్ ఆగస్టు 7 ప్రజాపాలన ప్రతినిధి సూరంశెట్టి ఉషారాణి అకాల మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆదివారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సూరంశెట్టి ఉషారాణి జ్ఞాపకార్థం నూతనంగా నిర్మించిన ఉషారాణి మందిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరం శెట్టి కుటుంబం మర్లపాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు సూరంశెట్టి ఉషారాణి సూరం శెట్టి కిషోర్ సూరం శెట్టి నాగభూషణం గ్రామ సర్పంచులు గా జడ్పిటిసిగా మండల బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. అనంతరం సూరం శెట్టి కుటుంబం నూతనంగా నిర్మించిన గృహాన్ని మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  మిరియాల రమణ గుప్తా కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు ఆవుల కిరణ్ అద్దంకి రవికుమార్ చిలువేరు బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు