మంచి రెడ్డి నరసింహారెడ్డి రైతు ను నాకు న్యాయం చేయాలి
Published: Monday January 24, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్ పల్లి పరిధిలో ఉన్న భూమిలో సర్వే నెంబర్ 282లో 1 ఎకరా 4 గుంటల భూమి ఎలిమినేడు గ్రామానికి చెందిన ఎం.నరసింహ్మరెడ్డి అనే వ్యక్తి 2014లో కొనుగోలు చేసి రాతి కడీలతో ఫెన్సింగ్ వేయిచుకోవడం జరిగిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా పోరెడ్డి నరసింహారెడ్డి, అతని తనయుడు పోరెడ్డి రాజేందర్ రెడ్డి, అనే వ్యక్తులు కొంత మందితో కలిసి నాపొలంతో ఎలాంటి సంబంధం లేకున్నా రాతి కడీలు విరగొట్టడం జరిగిందని ఆరోపించారు. అన్యాయంగా నా భూమిలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తున్నారని అనేకసార్లు సర్వే నిర్వహణకు రమ్మన్నా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాట వేస్తూ భూఆక్రమాలకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. నా భూమి కి సంబంధించిన దృవీకరణ పత్రాలు అన్ని కరెక్ట్ గా నావద్ద ఉన్నాయని ఎక్కడైనా ఎవరికైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని, ఎం.నరసింహ్మా రెడ్డి తెలిపారు. ఇలా నా పొలంలోని కడీలను దౌర్జన్యంతో ముక్కలు ముక్కలుగా చేసి నన్ను బెదిరిస్తున్నందువల్ల పోలీసులను ఆశ్రయించానని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారని, విచారణ చేసి తగున్యాయం చేస్తామని చెప్పారని నరసింహ్మారెడ్డి తెలిపారు.
Share this on your social network: