వాహనదారుల కోసం సూచిక బోర్డు ఏర్పాటు

Published: Saturday March 13, 2021
మహబుబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం ప్రజాపాలన: ప్రయాణించే వాహనదారుల కోసం కుమ్మరి కుంట్ల గ్రామంలో ని బస్ స్టేషన్ సమీపంలో సూర్యాపేట కుమ్మరికుంట్ల వెళ్లే ప్రయాణికుల కోసం శుక్రవారం గ్రామ సర్పంచ్ అల్లం కృష్ణ సూచిక బోర్డును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరి కుంట్ల బస్టాండ్ సమీపంలో ఏక్స్ రోడ్డును తలపిస్తూ నాలుగు దారులు  ఉన్నటువంటి దారులతో కొత్తగా వాహనాల ద్వారా వెళ్లే ప్రయాణికులకు ఎటు వైపు ఏ ఊరు ఉందో అని ఆందోళన చెందుతున్నారని తమ దృష్టికి రావడంతో స్పందించిన గ్రామ సర్పంచ్ అల్లం కృష్ణ ప్రత్యేక చొరవతో ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని దారులు సూచించే నూతన సూచిక బోర్డును ఏర్పాటు చేశారు అది చూసిన గ్రామస్తులు సర్పంచ్ గారు చేసే పనులకు గను ఎంతో ఆనంద పడుతున్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ బాలరాజు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ చిల్ల నిరంజన్,  గ్రామస్తులు చిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు