కె.సి.ఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన తె.రా.స శ్రేణులు

Published: Thursday February 18, 2021
వెల్గటూర్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలంలో వివిధ గ్రామాలలో సర్పంచులు ఎం.పీ.టీ.సీ లు తె.రా.స నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి  కే.సీ.ఆర్  పుట్టినరోజు సందర్బంగా పురస్కరించుకుని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని.మున్ముందు తరాలకు మనం అందించే గొప్ప కానుక పచ్చదనం మరియు మంచి పర్యావరణంతెలంగాణ తెచ్చిన మన కే.సీ.ఆర్ కు హరిత విప్లవం తె.రా.స శ్రెనులు ఇస్తూన్నా పుట్టినరోజు కానుకగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డి. డబ్ల్యు.ఒ నరేందర్, సహకార సంఘం అధ్యక్షులు గూడా రామ్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎం.డి రియాజ్, కూనమల్ల లింగయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చుక్క శంకర్రావు, సర్పంచులు మారం జలంధర్ రెడ్డి, అనుమల తిరుపతి, మెతుకు సరూప స్వామి, కార్యదర్శులు, అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, పాలకవర్గం పాలకవర్గం సభ్యులు మహిళలు, మహిళా సంఘ సభ్యులు తెరాస శ్రేణులు ఉత్సాహంగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా పాల్గొని విరివిగా మొక్కలు నాటారు మండలంలోని వివిధ గ్రామాలలోని ఆలయాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. తాసిల్దార్ ఎం రాజేందర్, మండల అభివృద్ధి అధికారి సంజీవ్ రావు, విద్యాధికారి భత్తూల భూమయ్య, ఏ.పీ.ఎం చంద్రకళ, మండల స్థాయి అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.