షర్మిల ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యం

Published: Saturday July 09, 2022
ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు*మధిర జూలై 8 ప్రజాపాలన ప్రతినిధి వైయస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగ జిల్లా అధ్యక్షుడు మద్దెల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారుతెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ షర్మిల ద్వారానే సాధ్యమవుతుందని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గం పరిధిలోని చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు వాక వీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రైతులకు ఉచిత విద్యుత్తు, పీజు రియంబర్స్మెంట్, 108, 104, ప్రాజెక్టుల నిర్మాణం, పేదలకు ఇల్లు నిర్మాణం, పెన్షన్లు పెంపు మైనార్టీలకు రిజర్వేషన్లు తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించారన్నారు. వైయస్సార్ అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు యధావిధిగా అమలు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో షర్మిలమ్మ అధికారంలోకి వస్తేనే అవి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని గెలిపించాలని వారు కోరారు.