సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Wednesday December 29, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతి గ్రామానికి లింకు రోడ్లు అవసరమని అందుకే ప్రతి గ్రామానికి సిసి రోడ్లు మంజూరు చేయించి నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు తోంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, మాజీ ఎంపీపీ సుభాష్ రావు , గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు మల్లేష్ , ఇతర పార్టీల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.