రైతులకు కంది విత్తనాలు పంపిణీ
Published: Wednesday June 16, 2021
పరిగి, 15 జూన్, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని గంజి పల్లి, బడేoపల్లి జాతీయ ఆహార భద్రత మిషన్(ఎన్ ఎఫ్ ఎస్ ఎమ్) పథకంలో భాగంగా వ్యవసాయదారులు అయినా రైతులకు కంది విత్తనాలు జడ్పిటిసి నాగిరెడ్డి ఎంపీపీ అనసూయ వైస్ ఎంపీపీ గురుమిట్కల్ మల్లేశం చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకంలో భాగంగా గంజి పల్లి బడేంపల్లి కొండపల్లి బట్ల చందరం మల్లేపల్లి దాదాపూర్ గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పథకం లో చిన్న సన్నకారు రైతులకు ఒక్కొక్కరికి రెండు కేజీల నుంచి 4 కేజీల వరకు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ గురుమిట్కల్ మల్లేశం, వ్యవసాయ సలహా సంచాలకులు ఏడిఏ వీరప్పన్, బడేం పల్లి ఎంపీటీసీ దామోదర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అలివేలు వ్యవసాయ విస్తరణ అధికారులు భాబ్య నాయక్, చిన్నయ్య రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: