ప్రమాద కరంగా ఉన్నబోనకల్ ఆర్వోబి

Published: Thursday September 30, 2021
బోనకల్లు ప్రజాపాలన ప్రతినిధి సెప్టెంబర్ 29 : బోనకల్ మండల కేంద్రంలో ఉన్న ఆర్వోబి బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బోనకల్ గ్రామానికి చెందిన రావుట్ల శివ కృష్ణ రావినూతల నుండి  ద్విచక్రవాహనంపై వస్తుండగా ఆర్వోబి పై ఉన్న గుంటను తప్పించబోయి శివ కృష్ణకు ప్రమాదం జరిగింది. క్షతగాత్రునికి ముఖంపై బలమైన గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెబుతున్నారు. ప్రతిరోజు ఈ ఆర్వోబి పై ఉన్న గుంతలను అధికారులు చూస్తూనే ఉన్నారు. కానీ గుంతలకు మరమ్మతులు చేయక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఈ గుంటలను ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని తెలియజేయడం జరిగింది.