వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో. అంబులెన్స్ వితరణ

Published: Monday May 09, 2022
మధిర మే 8 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుసమాజానికి విలువలతో కూడిన రాజకీయ సేవలు ఎంతో అవసరం. సీనియర్ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితోనే ప్రజలకు సేవా కార్యక్రమాలు. కిషోర్ కుమార్ దొంతమాల కే కే డి ఫౌండేషన్ ద్వారా మధిర ఆర్కే ఫౌండేషన్ కి అంబులెన్స్ వితరణ. మధిర ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల కే కే డి మధిర ఆర్కే ఫౌండేషన్ కి అంబులెన్స్ అందించారు. సీనియర్ వైద్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం చేతుల మీదుగా ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు దోర్నాల రామకృష్ణకి కే కే కెడి అంబులెన్స్ తాళాలు అందించారు.ఈ రోజు వైరా రోడ్డులోని ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రామనాధం మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయ సేవలు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. మధిర ప్రజల మీద అభిమానంతో వారికి సేవ చేసేందుకు వైఎస్ఆర్తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ ఉచితంగా అంబులెన్స్ అందించటం గొప్పవిషయమని కొనియాడారు. kkd చేస్తున్న సేవా కార్యక్రమాలును వైద్యులు డాక్టర్కోట రాంబాబు అభినందించారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు 108, ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే ఆయన కూతురు షర్మిల స్థాపించిన వైయస్సార్తెలంగాణ పార్టీ ద్వారా మధిర ప్రజలకు కేక్ డి ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మధిరలో ఆర్కే ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దోర్నాల రామకృష్ణ దంపతులను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమా వేణు గోపాలరావుసూరి, తెలంగాణ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మద్దెల ప్రసాద్, మైనార్టీ సంఘం జిల్లా కన్వీనక్మస్తాన్పాషా, ముగిగొండ, చింతకాని, బోనకల్ మండల అధ్యక్షులు సామినేని రవి, వాకా వీరారెడ్డి, ఇరుగు జ్ఞానేశ్ మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ కార్యకర్తలు కలకా వెంకట్రావు, రాజేష్, సురేష్, బన్ని, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు