పెంచిన సిలిండర్ ధరలు వెంటనేతగ్గించాలని కోరుట్ల టిఆర్ఎస్ పార్టీ ధర్నా

Published: Friday July 08, 2022
కోరుట్ల, జూలై 07 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని అవలంబిస్తున్న మొండి వైఖరి విధానాలను విరమించుకోవాలని కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో సిలిండర్లతో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేసిన కోరుట్ల మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు.ఈ ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ , ఎంపీపీ తోట నారాయణ, వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, రైతు సమితి జిల్లా అధ్యక్షులు చీటీ వెంకటరావు, కోరుట్ల పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, కోరుట్ల పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, మార్కెట్ కమిటీ సభ్యులు, ఏఎంసి,చైర్మన్,మరియు ఇతర కౌన్సిలర్లు,సర్పంచులు,  ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, మండల ముఖ్య పార్టీ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.