నేడు ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
Published: Monday August 02, 2021
ఖమ్మం ఆగస్ట్ 1 (ప్రజాపాలన ప్రతినిధి) : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ ఇన్చార్జీ తుంబూరు దయాకర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు రఘునాథపాలెం మండలం పంగిడి, గణేశ్వరం గ్రామాల్లో, ఉదయం 11 గంటల నుంచి కొణిజర్ల మండలం రాజ్యాతండా గ్రామంలో, మధ్యాహ్నం 12 గంటల నుంచి పెనుబల్లి మండలంలోని కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, తాళ్ళపెంట, గంగదేవిపాడు, వి.ఎం. బంజర, ఆర్.సీ.ఎం.బంజర, భవన్నపాలెం, ఏరుగట్ల రామచంద్రాపురం, లంకపల్లి, మండాలపాడు, పాత కారాయిగూడెం, కొత్త కారాయిగూడెం గ్రామాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పొంగులేటి పరామర్శిస్తారు. కావున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ ఇన్చార్జీ ప్రకటనలో తెలిపారు.
Share this on your social network: