అర్హులైన ఆడపడుచులకు బతుకమ్మ చీరలు కార్పోరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Tuesday October 05, 2021
మేడిపల్లి, అక్టోబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహిస్తోంది. ఈ మేరకు రామంతాపూర్ డివిజన్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని డివిజన్లోని ఎండోమెంట్ కాలనీలో మరియు ఆర్టీసీ కాలనీ మీ సేవ కమ్యూనిటీ హాలులో అర్హులైన ఆడపడుచులకు కార్పొరేటర్ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు తాళ్ల మంగమ్మ గౌడ్ పాల్గొన్నారు.