ధరలు తగ్గించేవరకు ఆందోళనలు ఉధృతం..
Published: Tuesday April 05, 2022
కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాపా సుధాకర్
తల్లాడ, ఏప్రిల్ 4 (ప్రజాపాలన న్యూస్): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించే వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కాపా సుధాకర్ అన్నారు. పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు సంభాని చంద్రశేఖర్ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై గ్యాస్ విద్యుత్ ఛార్జీలపై నిరసనగా తల్లాడలో కాపా సుధాకర్ అధ్యక్షతన ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తల్లాడ డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కటికి కిరణ్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షులు కృష్ణారావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ వెంకటేశ్వర్లు, సెల్ అధ్యక్షులు అంజయ్య, అల్లూరి చలపతిరెడ్డి, రమేష్, జమాల్, కాపా మహేష్, కాపా శ్రీనివాసరావు, దమ్మాలపాటి చందర్ రావు, కాంతారావు పాల్గొన్నారు.
Share this on your social network: