మండల ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో వనసమారాధన, వనభోజనాలు, మండల అధ్యక్ష ఉపాధ్యక్ష కమిటీల ఎన్నిక

Published: Tuesday November 16, 2021
బోనకల్, నవంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి : మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం ను పురస్కరించుకుని ఆదివారం రోజున వనసమారాధన, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం వనభోజనాల కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. కోవిడ్ కారణము చేత మండలలోని వివిధ కుటుంబాలలో మిత్రులను కోల్పోవడం జరిగింది. కోల్పోయిన మిత్రులలో పోపూరి నరసింహారావు, బి ఎన్ సీతారామయ్య, మాడుగుల జగన్, చల్లా రాణి, కోదుమూరి సుబ్బమ్మల కుటుంబాలకు మండల ఆర్యవైశ్య సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బోనకల్ మండల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. జిల్లా నాయకుల ఆదేశానుసారం జిల్లా ఎన్నికల అధికారి కొణతం లక్ష్మీనారాయణ గుప్త, ఎన్నికల కన్వీనర్ వీరవల్లి రాజేష్, దేవర శెట్టి వెంకట సతీష్ ఖమ్మం వారి అధ్యక్షతన బోనకల్ మండల అధ్యక్షులు గా చేడే వెంకటేశ్వర రావు, ప్రధాన కార్య దర్శిగా కలవల వెంకట లక్ష్మీ నారాయణ (బాబు), కోశాధికారిగా గుర్రం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులుగా కటకం శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శిగా రంగా జనార్దన్ రావు మరియు బోనకల్ పట్టణ అధ్యక్షులు గా తుమ్మలపూడి శ్రీనివాసరావు, ప్రధాన కార్య దర్శి గా మిరియాల రవి ప్రసాద్, కోశాధికారిగా చెన్న భాను, ఉపాధ్యక్షులుగా తెల్లాకుల శ్రీనివాసరావు, సహాయక కార్యదర్శి గా పుల్లఖండం నాగేశ్వర రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ వనసమారాధన కార్యక్రమంలో బోనకల్ మండలం లోని అన్ని గ్రామాల ఆర్యవైశ్య కుటుంబ మిత్రులు, మీడియా మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.