వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

Published: Thursday February 17, 2022
మంచిర్యాల బ్యూరో, పిబ్రవరి 16, ప్రజాపాలన: మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం  స్థానిక రైల్వే స్టేషన్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా వాసవి క్లబ్ నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచాల రఘువీర్ - వీరమని దంపతులకు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మంచిర్యాల తాసిల్దార్ రాజేశ్వర్ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, కోశాధికారి మల్యాల శ్రీనివాస్, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, జిల్లా వి కె ఎస్ పి ఇంచార్జ్ అప్పాల శ్రీధర్, రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్ కాచం సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త సురేందర్, సభ్యులు పడకంటి శ్రీనివాస్, యెర్రం వెంకటేష్, చెందురి ప్రభాకర్, కొత్త కృష్ణ, నలుమాసు రమేష్, చకినారపు రమేష్, గంప నాగేందర్, గంగిశెట్టి సతీష్ పాల్గొన్నారు.