మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కా

Published: Monday November 07, 2022
మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి  భారీ ఘనవిజయం సాధించడం పట్ల  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ఆదివారం నాడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
గుజరాత్ గులాంలకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరానికి జరిగిన పోరాటంలో ఘన విజయాన్ని తెలంగాణ ప్రజలు సాధించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వేంటే ఉన్నారని రుజువైందని అన్నారు. దేశంలోని ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న గుజరాత్ గులాములు నేడు వాటికి అడ్డుకట్ట వేయాలని ఎన్నో కుట్రలు పన్నిన విఫలమయ్యాయని అన్నారు. తెలంగాణలో బిజెపి పని కతం అయిందన్నారు. ఎన్నికల మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్ ని ఆశీర్వదిస్తూ టిఆర్ఎస్  పార్టీని స్వాగతిస్తున్నారని అన్నారు, రాబోవు ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్  పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బిజెపి మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మునుగోడు రుజువు చేసిందని తెలిపారు, దేశ రాజకీయాల్లో కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని  బిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ప్రధాన పోషించనున్నదని, ఇది దేశానికి తెలంగాణ ఒక దిక్సూచిగా నిలవదున్నదని స్పష్టం చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ బిజెపిలకు స్థానం లేదని తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్  పార్టీ మాత్రమేనని మరోసారి స్పష్టమైందని అన్నారు, ఈ విజయం ద్వారా ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వం పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని నిలిచిందని గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు, ఎవరని కుట్రలు, పన్నిన ఎప్పటికీ ధర్మం గెలుస్తుందని మునుగోడు ప్రజలు నిరూపించారని ఆయన తెలిపారు, బిఆర్ఎస్  పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేసిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.