పశువులకు గర్భకోశ పరీక్షలు చేయించుకోవాలి

Published: Friday November 11, 2022
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి అనిల్ కుమార్
వికారాబాద్ బ్యూరో 10 నవంబర్ ప్రజా పాలన : పశువులకు గర్భకోశ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా పరిశ్రమవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి అనిల్ కుమార్ అన్నారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని జంషెడ్పూర్ గ్రామంలో 12 ఆవులు 36 గేదెలకు గర్భకోష పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పాల ఉత్పత్తి పెంపుదలపై అవగాహన కల్పించామని వివరించారు. దూడల పెంపకంలో సూచనలు సలహాలు జాగ్రత్తలు చెప్పామని స్పష్టం చేశారు. ముద్ద చర్మం వ్యాధి గురించి, పశు గ్రాసాల పెంపకం పై అవగాహన కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ , గ్రామ రైతులు, సిరిపురం, కల్ఖోడ పశువైద్యులు డా. నరేంద్రనాథ్ రెడ్డి, డా. హరిప్రియ, సిబ్బంది , శ్రీనివాస్, కుమార్, సలీం, రమేష్ పాల్గొన్నారు.