సదరు ఉద్యోగి పై దాడి చేసిన సాయినాథ్ పై చర్యలు తీసుకోవాలని

Published: Thursday July 15, 2021
మధిర, జులై 14, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఉపాధిహామీ TA పై జరిగిన దాడికి నిరసననిర్మల్ జిల్లా కుబీరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు గారి పై సాంబ్లి గ్రామ సర్పంచ్ సాయినాథ్ నిన్న సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పుఅంటించి దాడి చేయటం జరిగింది. సదరు ఉద్యోగి పై దాడి చేసిన సాయినాథ్ పై కటిన చర్యలు తీసుకోవాలని సాంకేతిక సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా మధిర మండల పరిషత్ కార్యాలయంలో పనిస్తున్న ఉపాధిహామీ సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో APO జానకి రామిరెడ్డి గారు, EC అరుంధతి గారు, TA లు అనిల్ కుమార్, ప్రసన్న కుమారి, I నాగేశ్వరరావు, M నాగేశ్వరరావు, శాంతయ్య, కంప్యూటర్ ఆపరేటర్లు గిరీష్, సుజాత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.