కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో... జనరిక్ మందుల దుకాణం, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు

Published: Thursday April 01, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఏరియా హాస్పిటల్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణంను, బ్లడ్ బ్యాంక్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జనరిక్ మందుల దుకాణం, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా అభినదించదగ్గ విషయం అని, రెడ్ క్రాస్ సంస్థ సేవలు అమోఘం అని, సేవలు ఎంత. కొనియడిన తక్కువే నని, సేవే లక్ష్యంగా ముందుకువెళ్తున్నారని, ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు సరమైన ధరలకు, నాణ్యమైన మందులు లభించునని, దీని ద్వారా ప్రజలకు ఆర్థిక భారం తగ్గునని, ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం తగ్గిపోతుండడంతో తలసేమియా, ఇతరత్రా వ్యాధిగ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందని, రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని, యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులను, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది. వైద్య సిబ్బందికి మాస్క్ లు, సబ్బులు, శాని టైజర్లు పంపించేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ జనరల్ సెక్రటరీ / CEO మదన్ మోహన్ రావు, కోటి రెడ్డి, శ్రీనివాస్ MC మెంబెర్ స్టేట్,  IRCS రంగారెడ్డి ఛైర్మెన్ నర్సింహ రెడ్డి, వైస్ చైర్మన్ పాండు, రాఘవరెడ్డి, వంశీ మోహన్ డిప్యూటీ కలెక్టర్, తాసీల్ధార్, RI చంద్రారెడ్డి సూపర్డెంట్ దశరథ్, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ఉట్ల కృష్ణ, చాంద్ పాషా, భాస్కర్ రెడ్డి, తిరుపతి, నరేష్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.