నాచుపల్లి లో ఘనంగా రైతుబంధు వారోత్సవాలు.
Published: Friday January 07, 2022
కొడిమ్యాల జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామం లో ఎంపీపీ స్వర్ణలత ఆధ్వర్యంలో ఘనంగా రైతుబంధు వారోత్సవాలు ప్రారంభించారు. వాకిళ్ళలో రైతులు కె సి ఆర్ జై జవాన్ జై కిసాన్ రైతు బొమ్మలు ముగ్గులు వేసినారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రైతులకు రైతుబంధు ఇచ్చి పెట్టుబడి సహాయం చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. మండల వ్యవసాయ అధికారి పార్లపల్లి జ్యోతి ఏ ఈ ఓ మంజుల సింగిల్విండో చైర్మన్ రాజా నర్సింగరావు సర్పంచ్ అంబటి లత తిరుమలేష్ మరియు మండల ఉపాధ్యక్షుడు రోడ్ల శరత్ ఉప సర్పంచ్ నర్సయ్య నాచుపల్లి రైతు అధ్యక్షుడు సంజీవ రావు జిల్లా నాయకుడు గాజుల నరేష్ టి పోశయ్య దేవస్వామి వడ్లకొండ దశరథం తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: