ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో ప

Published: Friday November 18, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము వద్ద గురువారం రోజున అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. చెరుకూరి మహేందర్ తన కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్బంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండెం రామిరెడ్డి, తెలుగుదేశం నాయకులు జెలమోని రవీందర్,  బిజెపి నాయకులు కాళిదాసు, మాజీ రెవిన్యూ ఉద్యోగి జైన్ శ్రీ రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ, యాంపల్ల సుధాకర్ రెడ్డి, జెర్కొని రాజు, కన్నె అరవింద్, భోగవరపు రమేష్ గుప్తా  జర్నలిస్ట్ లు, అయ్యప్ప స్వాములు భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.