ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి *అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఘనంగా శ్

Published: Saturday December 10, 2022

తెలంగాణ రాష్ట్ర కలని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రదాత, కాంగ్రెస్  పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మదిన వేడుకలను *అబ్దుల్లాపూర్ మెట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మునికుంట్ల శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో * ఘనంగా నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జెడ్పిటిసి సభ్యులు బింగి దేవదాస్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రతినిది చిలుక మధుసూదన్ రెడ్డి గారు హాజరుకావడం జరిగింది*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియాగాంధీ తెలంగాణ కలను సాకారం చేసిందని, తెలంగాణ ప్రజలందరూ సోనియాగాంధీ గారికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు..
సోనియా గాంధీ చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకుంటారని తెలియజేశారు..
ఎంపిటిసి సభ్యులు తాటిపల్లి సౌమ్య రమేష్ గౌడ్, కెశెట్టి వెంకటేష్, కో అప్షన్ సభ్యుడు ఎండి గౌస్, స్థానిక ఉపసర్పంచ్ చెరుకు కావ్య -  శివశంకర్ గౌడ్ తో పాటు మందుగుల శ్రీకాంత్ గౌడ్, మహేష్ ముదిరాజ్, సురివి పోచయ్య, బొర్ర శ్రీకాంత్, నితిన్, ప్రవీణ్ * తదితరులు పాల్గొన్నారు.