మైనార్టీ కళాశాల విద్యార్థులను అభినందించిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Thursday June 30, 2022

జగిత్యాల, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ఇంటర్ ఫలితాలలో జగిత్యాల మైనారిటీ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక ఫలితాలు సాధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో  ఎంపిసి విభాగంలో  470 మార్కులకు గాను జేమ్స్ పాల్ 464 మార్కులు సాధించి స్టేట్ లో 4వ ర్యాంకుసాధించారని బై. పిసి విభాగంలో 440 మార్కులకుగాను రజియోద్దిన్ 421 మార్కులు సాధించారని  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  ఎన్. మహేందర్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్. దాసరి రాజేందర్ లను, అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థులను  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ అభినందించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల మతాల పేద మధ్య తరగతి ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంగా గురుకులాలను ఏర్పాటు చేశామని, ఒక్కో విద్యార్థి పై లక్షకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రం లో విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి పై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు అని అన్నారు.