వరి దాన్యం కొనుగోలు కేంద్రాలలోని సమస్యలను టోల్ ఫ్రీకు ఫిర్యాదు చేయాలి * జిల్లా అదనపు కలెక్ట

Published: Thursday May 19, 2022
వికారాబాద్ బ్యూరో 18 మే ప్రజాపాలన :
                                                            యాసంగి వరి దాన్యం కొనుగోలు కేంద్రాలలో  ఏవైనా  సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.   రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాల మౌలిక సదుపాయాలతో  జిల్లాలో 111 ధాన్యం  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.   రైతులకు ఏటువంటి సమాచారం కావలసివచ్చినా లేదా ఏవైన సమస్యలు ఉన్నా జిల్లా పౌర సరఫరాల సంస్థ  ఏర్పాటు చేసిన 9063373379, 9791151865, 6305725220  టోల్  ఫ్రీ నెంబర్ లకు ఫోన్ చేసి   రైతులు తమ సమస్యలను  పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్  ఆ ప్రకటనలో తెలిపారు.