ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యమే ప్రజావాణి : జిల్లా కలెక్టర్ నిఖిల
Published: Tuesday February 22, 2022
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ప్రజావాణికి వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా లోని తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 213 మంది ధరణి సమస్యలకు దరఖాస్తులను కలెక్టర్ నిఖిల స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు తహసీల్దార్లను ఆదేశించారు. ఇందులో అత్యధికంగా ధరణికి సంబంధించిన దరఖాస్తులు కాగా వీటిని ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, తాండూర్ ఆర్డిఓ లు విజయకుమారి, అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏ ఓ హరిత అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: