వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు

Published: Monday August 01, 2022
బోనకల్, జులై 31 ప్రజా పాలన ప్రతినిధి: వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న దీక్ష కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా యంగల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కలించాలని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు సీఎం కేసిఆర్‌ ఇచ్చిన హామీ లను అమలు చేయాలని సీపీఐ జిల్లా సమితి తూము రోషన్ కుమార్ కోరారు. ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఏలూరి పూర్ణచంద్, ఈశ్వరమ్మ ,తోటపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు.