రే'ఆఖా మినిస్ట్రీస్ వారి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట రాంబాబు

Published: Saturday April 01, 2023

మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండలం మర్లపాడు గ్రామంలో రే'అఖ మినిస్ట్రీస్ వారి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు హాజరై శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.కోట రాంబాబు మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలకు ఉపయోగపడే విధంగా వారి ఆర్థిక చేయూత కు తోడ్పాటు అందించే విధంగా ఇలాంటి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. మూడు నెలలు పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న పాస్టర్ టైటస్ ని వారి సతీమణి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మర్లపాడు గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి , సైదల్లీపురం గ్రామ సర్పంచ్ చిట్టిబాబు. కాంగ్రెస్ పార్టీ మధిర మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, పిఎసిఎస్ చైర్మన్ కటికల సీతారామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.